Friday, July 30, 2010

ఆషాఢస్య ప్రథమ దివసే..

తేదీ - జులై 12 వ తేదీ!
ఓ పల్లెలో.

ఆ రోజు ఆషాఢ మాసారంభం! తొలకరి జల్లు మొదలయింది. ఆ ఊరిపక్కన కొండ ఇలా ఉంది.

తస్సిన్నద్రౌ కతిచిదబలావిప్రయుక్తస్స కామీ
నీత్వా మాసాన్ కనకవలయభ్రంశరిక్తప్రకోష్టః
ఆషాఢస్య ప్రథమదివసే మేఘమాశ్లిష్టసానుం
వప్రక్రీడాపరిణతగజప్రేక్షణీయం దదర్శ.



ప్రేయసి విరహము అనుభవిస్తూ, ముంజేతి కంకణము లేని వాడయిన యక్షుడు ఆ పర్వతమందు కొన్ని మాసాలు గడిపి, ఆషాడమాసం మొదటి రోజు వప్రక్రీడలో నిమగ్నమైన ఏనుగులా కొండను ఆక్రమిస్తూన్న ఓ మేఘాన్ని చూశాడు.

పంటపొలం ఇలా ఉంది.


మా పాపాయి ఇలా అంది.




మా ఇంటి ముందు ఓ చెట్టిలా..


ఊరినుండి తిరిగి వస్తుంటే -

సూర్యకాంతం పూలు కూడా ’రవి’ ని చూడటం లేదు.


గత స్మృతులలో మునిగిన మధుగిరి కోట. ఆ కోట వివరాలిక్కడ.


జరిగి అప్పుడే ఎన్ని రోజులయ్యింది?

Friday, July 23, 2010

మత్తేభ ఘీంకారము

సిరికిం జెప్పడు;శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీరడభ్రగపతింబన్నింపడాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్కనొత్తడు వివాదప్రోత్థితశ్రీకుచో
పరిచేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సా హియై.

ఆ పద్యం చదివి వెనకటికి శ్రీనాథుడు పోతనతో అలా ఎలా వస్తాడు? అసంబద్ధం అని లాజించితే, పోతన ఓ రాయిని పెరటి బావిలోకి విసిరి శ్రీనాథునితో, "అయ్యా! మీ అబ్బాయి బావిలో పడ్డాడు" అని చెప్పి, తను పరిగెత్తితే, "ఇదుగో ఇలానే శ్రీవారు కూడా వెళ్ళారండి!" అని జవాబిచ్చాడట.

ఇప్పటి ఐదవతరం హైటెక్ కూలీలకు మాత్రం బాసురుడు పిలిస్తే ఆఫీసుకు పరిగెట్టటం అలవాటే.అలాంటి ఓ మందభాగ్యుని ఉదంతం ఈ పేరడీ.

సతికిం జెప్పడు; పెన్ను పర్సుయుగమున్ షర్టందు సంధింపడే
గతిఁ తిండిన్ తిననేరడద్దముఁ వెసన్ కాంక్షింప డాకర్ణికా
వృత ధమ్మిల్లముఁ జక్కనొత్తడు సుసంప్రీతిన్ విహారాదులన్
మతిఁ గోరండల చేరి బాసురవరున్ మానావనోత్సాహియై

తెరవెనుక:

నాకు మత్తేభం ఎలా వ్రాయాలో తెలియడం లేదు. జాలంలో మత్తేభం అని వెతికితే "సిరికిం జెప్పడు" అని వస్తూంది. నేను మత్తేభం నేర్చుకునే వరకు ఇలాంటి దారుణమైన ఆలోచనలు ఆగకపోవచ్చు. పోతన మీద ఇదివరకే ఒకాయన కలం చేసుకున్నారు. ఇక్కడ చదవండి.

ఆకర్ణికాంతర ధమ్మిల్లము 
శ్రీకుచో పరిచేలాంచలము - వీటి అర్థాలు తెలపవలసిందని కోరుతున్నాను.