బ్లాగ్లోకంలో సున్నితమైన విషయాల గురించి చర్చలు రకరకాల రీతుల్లో కొనసాగుతున్నాయి. ఇంతకు మునుపు చివుకుల కృష్ణమోహన్ గారి బ్లాగులో మొదలయిన రామాయణ చర్చ అనేక రీతుల్లో సాగి, అంతకు మునుపు ఇదే విషయంపై సాగిన చర్చను వెలికి తీసింది, ఇంకా విభిన్న కోణాలను ఆవిష్కరించింది. అయితే, లోగడ ఓ సారి భైరవభట్ల గారు సూచించినట్లు, ఇలాంటి చర్చల వల్ల అపోహలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి.ఆ అపోహలకు కారణం ఆయా వ్యక్తులకు ఆయ విషయాలపై మీద ఉన్న తీవ్రమైన నమ్మకం ఓ కారణం కాగా, రచయిత చెప్పిన విషయాలను, ఉద్దేశ్యాలను ఆకళింపు చేసుకునే ప్రయత్నం కన్నా ముందుగానే అభిప్రాయాలకు వచ్చేయడం ఇంకో కారణం అవుతోంది.
ఓ నమ్మకాన్ని తీవ్రంగా విశ్వసించడం వల్ల మన దృక్కోణం పాక్షికమవుతుంది. సరిగ్గా అక్కడే నమ్మకం సిద్ధాంతంగా మారడం జరుగుతుంది.
తిరిగి అడుసు తొక్కుతున్నానని అనుమానం ఉన్నా, ఇప్పుడు రాముడిపైనో, మత విశ్వాసాల మీదో బురద చల్లడం నా ఉద్దేశ్యం కాదు కాబట్టి, రాముడి సంగతి ప్రస్తావిస్తున్నాను ధైర్యం చేసి.
"రాముడు ఏకపత్నీ వ్రతుడు. శూర్పణఖ వలచినా లొంగలేదు...తన కు భార్య లేకుంటే యాగానికి అనర్హుడనైనప్పుడు బంగారు బొమ్మను పెట్టుకున్న ఆతండ్రి ఏకపత్నీ వ్రతమెక్కడ? ..."
ఓ వ్యక్తి ఔన్నత్యమో, గొప్పతనమో మనం ఊహించేప్పుడు, తన చర్యలను, వాటి వెనుక ఉద్దేశ్యాలను, ఆ తర్వాత ఉద్దేశ్యాల వెనుక సిద్ధాంతాలను మనం పరిగణిస్తాం అసంకల్పితంగానైనా.
"కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ద్వారా కర్తవ్య బోధ చేశాడు"
కృష్ణుడి చర్య - గీత బోధ (ఇక్కడితో ఆగితే మనకు కృష్ణుడి గొప్పతనం తెలియదు)
ఉద్దేశ్యం - కర్తవ్య విమూఢుడిగా ఉన్న అర్జునుడికి దిశానిర్దేశం చేయడం. (ఇక్కడ మనకు ఆయన గొప్పతనం తెలుస్తుంది).
ఇప్పుడు మొదటి వాక్యం చూద్దాం.
"రాముడు ఏకపత్నీ వ్రతుడు. శూర్పణఖ వలచినా...."
చర్య - ఏకపత్నీవ్రతం
ఉద్దేశ్యం - జాగ్రత్తగా ఆలోచిస్తే,
ఏకపత్నీవ్రతం - ఓ గొప్ప వ్రతం.
ఏకపత్నీ వ్రతం - తనకు జీవితానికి అనుకూలం
మొదటి విషయానికి వస్తే, ఏకపత్నీ వ్రతం గొప్ప వ్రతమా? అలా అయితే, స్వయంగా రాముడి తండ్రి దశరథుడు ఏకపత్నీ వ్రతుడెందుకు కాలేదు? ఇంకా కాస్త ముందుకెళితే, సుగ్రీవుడు ఏకపత్నీ వ్రతుడు కాడు. సీతను చెరపట్టక ముందు వరకు రావణుడు - గొప్ప శివభక్తుడు, ఆత్మ లింగాన్ని సాధించిన వాడు, గొప్ప వ్యాకరణవేత్త, జ్యోతిశ్శాస్త్ర పండితుడు, రాజనీతిఙ్ఞుడు. లంకా రాజ్యం సకల సౌభాగ్యాలతో తులతూగేది, కాస్తో కూస్తో అయోధ్యకంటే కూడా. ఆ రావణుడు బహుపత్నీకుడే. అంటే, అప్పటి సమాజ పరిస్థితుల దృష్ట్యా చూచినా బహుపత్నీ వ్రతం పెద్ద దోషం కాదు.ఏకపత్నీ వ్రతం గొప్ప వ్రతమూ కాదు. (ఇక్కడ ఓ చిన్న విషయం. ఏకపత్నీ వ్రతం గొప్ప వ్రతం కాదు అని నేను ఊహించినది దశరథుడు మొదలైన వారు పాటించలేదు కాబట్టి అన్న అంచనాతో వచ్చింది తప్ప, రామాయణ గ్రంథం ఆసాంతం చదివి కాదు. ఒకవేళ వాల్మీకి తగిన కారణాలు చెప్పి ఉంటే తప్పు నాదే.). ద్వాపర యుగానికి వస్తే, కృష్ణ పరమాత్ముడు బహుపత్నీకుడు.
పై కారణాల దృష్ట్యా చూస్తే, ఏకపత్నీ వ్రతం అన్నది, తనకోసం తన అనుకూలత కోసం తను విధించుకున్న నియమం అన్నది మాత్రమే కనిపిస్తుంది.అంటే, ఇంకో రకంగా చెప్పాలంటే, ఏకపత్నీ వ్రతం అన్నది ఓ సిద్ధాంతం (ideal) తప్ప అంతర్గతంగా విలువను ఆపాదించుకున్న ఓ సత్యం అన్న చెప్పలేము. ఏకపత్నీ వ్రతం గొప్ప వ్రతం అయితే కృష్ణుడి గొప్పతనాన్ని శంకించాలి. రాముడి ఏకపత్నీవ్ర్తతం ఎంత గొప్ప నియమమో, కృష్ణ పరమాత్ముని ప్రేమతత్వం కూడా అంటే గొప్పది. అంటే - (ఓ మనిషి చర్యలో) గొప్ప తనం సిద్ధాంతంలో లేదు!
ఇక్కడ నా ఉద్దేశ్యం, రాముడనే పౌరాణిక పురుషుడిపై బురద చల్లటమో, లేదూ, తప్పుల తడక అభిప్రాయాలను అందరిపై రుద్ధటమో కాదు. కేవలం, ఓ సిద్ధాంతం ఎంత గొప్పగా కనపడినా అందులోని పాక్షికత ను ఉదహరించటమే. అలాగని ఏకపత్నీ వ్రతులందరూ చెడ్డ వారని చెప్పటం లేదు.
రాముడు, లేదా ఓ మహనీయుడి గురించి తెలుసుకోవాలంటే, వారి చర్యలు, వాటి వెనుక అంతర్యం లోని మౌలిక విలువల గురించి సూక్ష్మ పరిశీలన గావించి తెలుసుకోవాలి. లేదంటే, వారి వ్యక్తిత్వాలు మన దైనందిన జీవితాలకు ఉపయోగపడతాయో వాటిని గ్రహించాలి.
సందర్భం వచ్చింది కాబట్టి, నేను చేసిన వ్యాఖ్యలు, గురించి ప్రస్తావిస్తాను.
"కృష్ణుడు ఆత్మ నిర్దేశం ప్రకారం నడుచుకున్న వాడు కాబట్టి అవతార పురుషుడు" - ఈ నమ్మకం నాలో బలంగా నాటుకుపోవటం వల్ల, ఓ సారి నా వ్యాఖను నేను పునశ్చరించుకున్నప్పుడు ఇదో ideal - ప్రతిపాదన లాగానే కనిపించింది తప్ప, ఇందులో నేను కనుక్కున్నది, నిజం అన్నది ఏమీ లేదు. అలానే కృష్ణుడి ఇంకొకరు చెప్పిన statement లో కూడా ప్రతిపాదన కనిపించవచ్చు తప్ప, ఓ మౌలికత, అంతర్గత విలువ అన్నవి లేవు.
ఈ విషయం మనం సంయమనంతో, ఆత్మ పరిశీలనలో మనం తెలుసుకోగలిగితే, వివాదాలు వచ్చే అవకాశం తక్కువ. అప్పుడు ఓ గొప్ప విలువ, లేదా ఓ మహనీయుడి వ్యక్తిత్వం అన్నది మౌలికంగా మన నిత్యజీవితాలకు ఉపయోగపడుతుంది అన్న దృక్పథంలో ఆలోచిస్తామేమో!
Friday, November 14, 2008
Wednesday, November 12, 2008
సైటోపాఖ్యానం
"ఉష్ ష్..మాట్లాడకు"
"మెల్లగా వెనక్కి తిరిగి చూడు"
"ఇప్పుడు కూరగాయలు కొంటున్నట్టు నటిస్తూ, నాకు సైటు కొడతాడు చూడు"
ఏ సినిమా నో తెలిసుండాలి?
గీతాంజలి.
అప్పట్లో "యూత్" కేకలు పెట్టారు, సైట్ కొట్టటం, లేచిపోదాం ...ఇలాంటి డవిలాగులను విని. ఇంకా బాగా వెనక్కి వెళితే, మన నలుపు తెలుపు కళాఖండాల్లో, "ఇల్లరికం" లో నాగేశ్వర్రావు "నిలువవే వాలు కనుల దానా" అంటూ జమున వెనుక పడటం, అప్పట్లో యూత్ ను ఉర్రూతలూగించి ఉంటుంది. ఇంకా "అయ్యయ్యో బ్రహ్మయ్య",అంటూ ఏయెన్నారు, "గుంతలకిడి గుమ్మ" అంటూ స్టిఫ్ గా చేతులు పెట్టుకుని డాన్స్ చేస్తూ కృష్ణ గారు, 80 వ దశకంలో బెల్ బాటం తో శ్రీదేవి ని ఆటపట్టిస్తూ (పీడిస్తూ) ఎన్టీ వోడు, "బెక బెక బావురు కప్పా....కోకోనట్" అంటూ బాపు బొమ్మ వెంటపడ్డ, మెగా స్టారుడు (మంత్రి గారి వియ్యంకుడు), "కోక దాగుడు కోటమ్మో" అంటూ సినిమాల్లో ఆరంగేట్రం చేసిన మొదట్లోనే విజయ శాంతి వెనుకపడ్డ బాలయ్య, "చికుబుకు చికుబుకు రైలే" అంటూ వూగిపోయిన ప్రభుదేవా,మొన్నామధ్య దేశముదురు లో "నిన్నే నిన్నే" అంటూ గ్లామరు సన్యాసి పిల్ల వెంట పడ్డ ఓ దేహముదురు....లిస్టు పెద్దదే!
అమ్మాయిలకు సైట్ కొట్టటం, లైనెయ్యడం అన్నది చాలా చాలా పాత ఫార్ములా అయినా హిట్ ఫార్ములా. నిజానికి ఇది ఫార్ములా కాదు, అన్నం లో ఆవకాయలా సినిమాల్లోనూ, ఇంకా మన జీవితాల్లోనూ ఉన్న ఓ స్పయిసే. మనలో చాలా మంది కూడా కాలేజీ జీవితంలోనో, ఆ తర్వాతో ఎవరికో ఒకరికి, ఏదో రకంగా లైను వేసి ఉంటాం..అమ్మాయిలు వెంటపడే అబ్బాయిలను చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకొని ఉండటం కూడా మామూలే.
నా వరకూ వస్తే తెగ లైన్లు వేసి, వేసి బాగా స్కిల్స్ సాధించి, లైన్మెన్ స్టేటస్ నుండీ బయటపడే లోపు పెళ్ళయిపోయింది!
సరే, ఇంతకూ సంగతేంటో చెబుతాను. నేను సంస్కృతం చదువుకునే రోజుల్లో, రఘువంశం 6 వ సర్గ ఉండేది మాకు. సర్గ మొత్తం పూర్తిగా. ఆ సర్గ లో సన్నివేశం ఇది.
హీరో స్వయవరానికి వచ్చి ఉంటాడు. స్వయంవరం చేసుకోబోతున్నది, ఇందుమతి అన్న హీరోవిను. పైగా సంచారిణీ దీపశిఖ.ఇంత అందంగా ఉన్న అమ్మాయిని వరించడానికి ఆశపడని రాజు ఉంటాడా? అయితే అది స్వయంవరమాయె. ప్రతి రాజు దగ్గరా ఆమె కాసేపు ఆగి, ఆ రాజు గుణగణాలు తన చెలికత్తె సునంద విశదీకరించిన తర్వాత, నిర్ణయం తీసుకుంటుంది. ఆ సమయం చాలా తక్కువ.ఆ కొద్ది సమయంలో ఆమెను ఎలాగైనా మెప్పించాలి. అందుకని కొంతమంది రాజులు, ఆమె తమవద్దకు రాగానే ఆమెకు సైటు కొట్టటం ప్రారంభించారు.
అందులో మొదటాయన.
కశ్చిత్కరాభ్యాముపగూఢనాళం
ఆలోల పత్రాభిహతద్విరేఫం
రజోభిరంతః పరివేశబంధి
లీలారవిందం భ్రమయాంచకార
తామర పూవు కాడ (నాళం)ను రెండు అరచేతుల మధ్య ఉంచుకుని (ఇరికించుకుని), రేకులు ఎగిరిపడుతుంటే, ఆ పువ్వు పై వాలిన తుమ్మెదలు చెదరి పడేట్టు, తామర తూడు చుట్టుకుని పోయేట్టుగా, రెండు చేతుల మధ్య విలాసంగా తిప్పుతున్నాట్ట.
ఇక రెండవ కాండిడేటు.
విస్రస్తమంసాదపరో విలాసీ
రత్నానువిద్ధాంగదకోటిలగ్నం
ప్రాలంబముత్కృశ్య యథాప్రదేశం
నినాయ సాచీకృతచారువక్త్రః
కాస్త ఫేసు టర్నింగ్ ఇచ్చుకుని, వదులుగా ఉన్న తన రత్నఖచితమైన భుజకీర్తులను భుజానికి అదుముకుంటూ, వక్షస్తలాన్ని సవరించుకుంటూ ఉన్నాడు (ట).
మూడవ పార్టీ.
ఆకుంచితాగ్రాంగుళినా తతోన్యః
కించిత్సమావర్జిత నేత్రశోభః
తిర్యగ్విసంసర్పినఖప్రభేణ
పాదేన హైమం విలిలేఖ పీఠం
కాస్త తలవంచుకుని, కాలి బొటన వేలిని కాస్త మడిచి, కాంతులీనుతున్న గోరుతో (నఖంతో)హేమ పీఠాన్ని రాస్తున్నాడట.
......
......
............
ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆమెను ఆకర్షించాలని ప్రయత్నించేరు. ఆమె ఆఖరుకు అజ మహారాజు (దశరథుడి తండ్రి) ను వరించింది.
ఈ శ్లోకాలు 10 వ తరగతి లో (తెలియని వయసులో) చదువుకోవడం వల్ల, పెద్దగా అర్థాలు కనబడలేదు.చాలా రోజుల తర్వాత ఈ పుస్తకం దొరికితే, అందులో చూసి, కాస్త గుర్తుకొచ్చింది బ్లాగడం జరిగింది.
ఇంకో విషయం. కాళిదాస కృతులకు భాష్యం రాసినాయన పేరు కోలాచలం మల్లినాథ సూరి. ఈయన పదహారు అణాల తెలుగు వాడు. ప్రతీ శ్లోకంలోని నిగూఢ భావాలకు ఈయన భాష్యం చెప్పాడు(ట). ఉదాహరణకు, పైన మూడవ పార్టీ విషయం తీసుకుంటే, బొటన వేలితో పీఠాన్ని గీరడం దరిద్రానికి చిహ్నమట. అందుకనే ఇందుమతీదేవి ఆ రాజును వరించలేదట!
ఈ విషయాలు ఎవరైనా సంస్కృతం బాగా తెలిసిన వాళ్ళు విడమర్చి బ్లాగితే చాలా బావుంటుంది.
(ఇది ఈ సర్గ పరిచయం మాత్రమే, పైగా నాకు సంస్కృతంలో మంచి అభినివేశం లేదు.కాబట్టి తప్పులు ఉంటే, సవరించగలరు)
***************************
"మెల్లగా వెనక్కి తిరిగి చూడు"
"ఇప్పుడు కూరగాయలు కొంటున్నట్టు నటిస్తూ, నాకు సైటు కొడతాడు చూడు"
ఏ సినిమా నో తెలిసుండాలి?
గీతాంజలి.
అప్పట్లో "యూత్" కేకలు పెట్టారు, సైట్ కొట్టటం, లేచిపోదాం ...ఇలాంటి డవిలాగులను విని. ఇంకా బాగా వెనక్కి వెళితే, మన నలుపు తెలుపు కళాఖండాల్లో, "ఇల్లరికం" లో నాగేశ్వర్రావు "నిలువవే వాలు కనుల దానా" అంటూ జమున వెనుక పడటం, అప్పట్లో యూత్ ను ఉర్రూతలూగించి ఉంటుంది. ఇంకా "అయ్యయ్యో బ్రహ్మయ్య",అంటూ ఏయెన్నారు, "గుంతలకిడి గుమ్మ" అంటూ స్టిఫ్ గా చేతులు పెట్టుకుని డాన్స్ చేస్తూ కృష్ణ గారు, 80 వ దశకంలో బెల్ బాటం తో శ్రీదేవి ని ఆటపట్టిస్తూ (పీడిస్తూ) ఎన్టీ వోడు, "బెక బెక బావురు కప్పా....కోకోనట్" అంటూ బాపు బొమ్మ వెంటపడ్డ, మెగా స్టారుడు (మంత్రి గారి వియ్యంకుడు), "కోక దాగుడు కోటమ్మో" అంటూ సినిమాల్లో ఆరంగేట్రం చేసిన మొదట్లోనే విజయ శాంతి వెనుకపడ్డ బాలయ్య, "చికుబుకు చికుబుకు రైలే" అంటూ వూగిపోయిన ప్రభుదేవా,మొన్నామధ్య దేశముదురు లో "నిన్నే నిన్నే" అంటూ గ్లామరు సన్యాసి పిల్ల వెంట పడ్డ ఓ దేహముదురు....లిస్టు పెద్దదే!
అమ్మాయిలకు సైట్ కొట్టటం, లైనెయ్యడం అన్నది చాలా చాలా పాత ఫార్ములా అయినా హిట్ ఫార్ములా. నిజానికి ఇది ఫార్ములా కాదు, అన్నం లో ఆవకాయలా సినిమాల్లోనూ, ఇంకా మన జీవితాల్లోనూ ఉన్న ఓ స్పయిసే. మనలో చాలా మంది కూడా కాలేజీ జీవితంలోనో, ఆ తర్వాతో ఎవరికో ఒకరికి, ఏదో రకంగా లైను వేసి ఉంటాం..అమ్మాయిలు వెంటపడే అబ్బాయిలను చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకొని ఉండటం కూడా మామూలే.
నా వరకూ వస్తే తెగ లైన్లు వేసి, వేసి బాగా స్కిల్స్ సాధించి, లైన్మెన్ స్టేటస్ నుండీ బయటపడే లోపు పెళ్ళయిపోయింది!
సరే, ఇంతకూ సంగతేంటో చెబుతాను. నేను సంస్కృతం చదువుకునే రోజుల్లో, రఘువంశం 6 వ సర్గ ఉండేది మాకు. సర్గ మొత్తం పూర్తిగా. ఆ సర్గ లో సన్నివేశం ఇది.
హీరో స్వయవరానికి వచ్చి ఉంటాడు. స్వయంవరం చేసుకోబోతున్నది, ఇందుమతి అన్న హీరోవిను. పైగా సంచారిణీ దీపశిఖ.ఇంత అందంగా ఉన్న అమ్మాయిని వరించడానికి ఆశపడని రాజు ఉంటాడా? అయితే అది స్వయంవరమాయె. ప్రతి రాజు దగ్గరా ఆమె కాసేపు ఆగి, ఆ రాజు గుణగణాలు తన చెలికత్తె సునంద విశదీకరించిన తర్వాత, నిర్ణయం తీసుకుంటుంది. ఆ సమయం చాలా తక్కువ.ఆ కొద్ది సమయంలో ఆమెను ఎలాగైనా మెప్పించాలి. అందుకని కొంతమంది రాజులు, ఆమె తమవద్దకు రాగానే ఆమెకు సైటు కొట్టటం ప్రారంభించారు.
అందులో మొదటాయన.
కశ్చిత్కరాభ్యాముపగూఢనాళం
ఆలోల పత్రాభిహతద్విరేఫం
రజోభిరంతః పరివేశబంధి
లీలారవిందం భ్రమయాంచకార
తామర పూవు కాడ (నాళం)ను రెండు అరచేతుల మధ్య ఉంచుకుని (ఇరికించుకుని), రేకులు ఎగిరిపడుతుంటే, ఆ పువ్వు పై వాలిన తుమ్మెదలు చెదరి పడేట్టు, తామర తూడు చుట్టుకుని పోయేట్టుగా, రెండు చేతుల మధ్య విలాసంగా తిప్పుతున్నాట్ట.
ఇక రెండవ కాండిడేటు.
విస్రస్తమంసాదపరో విలాసీ
రత్నానువిద్ధాంగదకోటిలగ్నం
ప్రాలంబముత్కృశ్య యథాప్రదేశం
నినాయ సాచీకృతచారువక్త్రః
కాస్త ఫేసు టర్నింగ్ ఇచ్చుకుని, వదులుగా ఉన్న తన రత్నఖచితమైన భుజకీర్తులను భుజానికి అదుముకుంటూ, వక్షస్తలాన్ని సవరించుకుంటూ ఉన్నాడు (ట).
మూడవ పార్టీ.
ఆకుంచితాగ్రాంగుళినా తతోన్యః
కించిత్సమావర్జిత నేత్రశోభః
తిర్యగ్విసంసర్పినఖప్రభేణ
పాదేన హైమం విలిలేఖ పీఠం
కాస్త తలవంచుకుని, కాలి బొటన వేలిని కాస్త మడిచి, కాంతులీనుతున్న గోరుతో (నఖంతో)హేమ పీఠాన్ని రాస్తున్నాడట.
......
......
............
ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆమెను ఆకర్షించాలని ప్రయత్నించేరు. ఆమె ఆఖరుకు అజ మహారాజు (దశరథుడి తండ్రి) ను వరించింది.
ఈ శ్లోకాలు 10 వ తరగతి లో (తెలియని వయసులో) చదువుకోవడం వల్ల, పెద్దగా అర్థాలు కనబడలేదు.చాలా రోజుల తర్వాత ఈ పుస్తకం దొరికితే, అందులో చూసి, కాస్త గుర్తుకొచ్చింది బ్లాగడం జరిగింది.
ఇంకో విషయం. కాళిదాస కృతులకు భాష్యం రాసినాయన పేరు కోలాచలం మల్లినాథ సూరి. ఈయన పదహారు అణాల తెలుగు వాడు. ప్రతీ శ్లోకంలోని నిగూఢ భావాలకు ఈయన భాష్యం చెప్పాడు(ట). ఉదాహరణకు, పైన మూడవ పార్టీ విషయం తీసుకుంటే, బొటన వేలితో పీఠాన్ని గీరడం దరిద్రానికి చిహ్నమట. అందుకనే ఇందుమతీదేవి ఆ రాజును వరించలేదట!
ఈ విషయాలు ఎవరైనా సంస్కృతం బాగా తెలిసిన వాళ్ళు విడమర్చి బ్లాగితే చాలా బావుంటుంది.
(ఇది ఈ సర్గ పరిచయం మాత్రమే, పైగా నాకు సంస్కృతంలో మంచి అభినివేశం లేదు.కాబట్టి తప్పులు ఉంటే, సవరించగలరు)
***************************
Subscribe to:
Posts (Atom)

